మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..

నవతెలంగాణ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాటారం- భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

Spread the love