తిప్పాపూర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడి నియామకం

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు మండల బిజెపి అధ్యక్షులు రమేష్ రెడ్డి తెలిపారు. గ్రామ అధ్యక్షునిగా గణేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్, ప్రధాన కార్యదర్శి సిద్ధిరాములు, ఓబిసి అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు భాస్కర్ యాదవ్ ఎన్నికైనట్లు తెలిపారు. కిసాన్ మోర్చా అధ్యక్షునిగా మల్లేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ధర్మారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు యాసిన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లేష్, యువమోర్చా అధ్యక్షులు ప్రేమ గౌడ్, ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి ఎన్నుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బస్వరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాపురెడ్డి, నర్సారెడ్డి, జీవన్ రెడ్డి, సాకేత్ రెడ్డిలు పాల్గొన్నారు.
Spread the love