ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో ప్రమాదవశత్తు తుకారం హాన్మత్ ఇబ్జిత్వర్ అనే వ్యక్తి  ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన మేరకు  వివరాలు ఇలా ఉన్నాయి.మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నయగావ మండలం అంతర్గావ్ గ్రామానికి చెందిన తుకారం హాన్మత్ ఇబ్జిత్వర్ బ్రతుకుతెరువు కోసం గత ఐదు సంవత్సరాల క్రితం చౌట్ పల్లికి వచ్చి కుటుంబంతో కలిసి జీవనాన్ని సాగిస్తున్నాడు. శనివారం వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో రోటవేటర్ చేస్తుండగా ప్రమాదవశాత్తుగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ కింద పడిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు.  మృతుడు తుకారం హాన్మత్ ఇబ్జిత్వర్ భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love