నవతెలంగాణ – హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీతోపాటు మాసబ్ట్యాంక్, మీరాలం దర్గా, లంగర్హౌజ్ వద్ద ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే ఈ రూట్లలో అనుమతించనున్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. బహదూర్ పురా క్రాస్ రోడ్స్, పురానా పూల్, కామతి పూరా, కిషన్ బాగ్ వైపు నుంచి ప్రార్థనకి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం జూపార్క్, మసీదు అల్లా హు అక్బర్ ఎదురుగా వాహనాలు పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.