జారే ఆదినారాయణ నామినేషన్.. నాడు టీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా

నవతెలంగాణ- అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల నేపద్యంలో అశ్వారావుపేట నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్ధిగా జారే ఆదినారాయణ బుధవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు, సహాయ ఎన్నికల అధికారి, తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్ లకు దాఖలు చేసారు. ఆయన వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రధాన అనుచరుడు జూపల్లి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు, జ్యేష్ట సత్యనారాయణ, ఎం.పి.టి.సి వేముల భారతి లు పాల్గొన్నారు. కాగా గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగానికి 2014 లో రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా నామినేషన్ వేసారు. కానీ విజయం సాధించలేకపోయారు. నాటి నుండి పొంగులేటి అనుచరుడిగా ఆ పార్టీ లోనే నియోజక వర్గం వ్యాప్తంగా పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు శ్రీనివాసరెడ్డి తో పాటూ ఈయన కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈయన సీటు కోసం పొంగులేటి కృషి ఫలించడం తో ఈయనకు బి.ఫాం దక్కింది. దీంతో ఆయన బుధవారం కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసారు.
Spread the love