![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230829-WA0270.jpg)
బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలి.కేసీఆర్ మెప్పు కోసమే బీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవ తీర్మానాలని అసత్య ప్రచారాలు మానుకోవాలని మంగళవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి ఆరోపించారు. మండలంలోని స్కూల్ తాండ, జగదాంబ తండా, రమణ తాండ తో పాటు అన్నారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా, గ్రామ సభలో చర్చించి ఏకగ్రీవ తీర్మానాలు చేయాలి గాని, బి ఆర్ ఎస్ నాయకుల ఒత్తిడితో సర్పంచులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారని, ఏకగ్రీవ తీర్మానాలతో ప్రజల నుండి ఓట్లు సాధించలేరని, ఇది బి ఆర్ ఎస్ నాయకులు తెలుసుకోవాలని సూచించారు. ఏకగ్రీవ తీర్మానాలు చేయడం ప్రజల ఓటు హక్కును హరించడమేనని, నియంతృత్వ పాలనలో ప్రజలు గమనిస్తున్నారని, కెసిఆర్ పై షబ్బీర్ అలీ అత్యధికం మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సల్మాన్, దయానంద్, గణేష్, రమేష్, అనీఫ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.