డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న యాక్షన్-డ్రామా ‘స్లమ్ డాగ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అన్ని భాషా వెర్షన్లలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ’33 టెంపుల్ రోడ్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో ఈ ప్రాజెక్ట్ దాని టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్-లుక్ విడుదల నుండి హ్యాజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. నిర్మాతలు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్ల కోసం సిద్ధమవుతున్నారు.ఈ చిత్ర టీజర్ను ఈనెల 8న విడుదల చేయ నున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. టీజర్ పోస్టర్లో కనిపించిన విజువల్ ఎంతో డార్క్ అండ్ ఇంటెన్స్గా ఆకట్టుకుంటోంది. కళ్లకు గంతలు కట్టుకున్న ఓ వ్యక్తి మెడపై రక్తంతో తడిసిన కట్టి ఉంచిన దృశ్యం కథలోని బ్రూటల్ ప్రపంచాన్ని సూచించేలా కనిపిస్తోంది.విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుం డగా, టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న జాతీయ అవార్డు విజేత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చనుంది.ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది అని మేకర్స్ పేర్కొన్నారు.


