వంశీ కృష్ణ గెలుపు నల్లేరుపై నడకే…

– ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్  
నవతెలంగాణ- రామగిరి 
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని రామగిరి ఎంపీపీ అరెళ్లి దేవక్క కొమురయ్యగౌడ్ పేర్కొన్నా రు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆమే మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్యరంలో స్థానిక ప్రజాప్రతినిధుల, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. గతంలో దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర శాసన సభాపతి శ్రీపాదరావు ఆధ్యర్యంలో కాకా వెంకటస్వామిని గెలిపించుకున్నామన్నారు. శ్రీపాదరావు హయాంలో వెంకటస్వామి పెద్దపల్లి
పార్లమెంట్ పరిధిలో అనేక సేవలు చేశారని గుర్తుచేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల ప్రకారం ఆయన నేతృత్వం లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణని గెలిపించి తీరుతా మని స్పష్టం చేశారు.
Spread the love