![](https://navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231119-WA0008.jpg)
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నిజాంబాద్ జిల్లాకు పోలీస్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి మేఘాలయ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రితురాజ్ రవి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లోని పలు సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను నిజామాబాద్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం, ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ విజయ్ బాబు, పట్టణ సిఐ నరహరి, దక్షిణ మండల సీఐ వెంకటనారాయణ, ఉత్తర మండల సిఐ సతీష్, లతోపాటు ఎస్సైలు సందర్శించినారు. తరువాత ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో ఖిల్లా రోడ్డులో అడిషనల్ డీసీపీ జయరాం, ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ విజయబాబు పట్టణ సిఐ నరహరి సౌత్ సిఐ వెంకటనారాయణ నార్త్ సిఐ సతీష్ లతోపాటు వాహన తనిఖీలు నిర్వహించినారు. అదేవిధంగా సీఐలకు ఎస్ఐలకు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి పోలీస్ అబ్జర్వర్ రితురాజ్ రవి ఐపీఎస్ పలు సూచనలు చేశారు.