– పుస్తకావిష్కరణలో బోయినపల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023’ అనే పుస్తకం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఈపుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. వివిధ రంగాల మేధావులు, సామాజికవేత్తలు, ప్రజలు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఈ పుస్తకం ఉపయోగకరమనీ, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎకనామిక్స్ స్టాటిస్టికల్ శాఖ డైరెక్టర్ జి. దయానంద్, టీఎస్డీపీఎస్ కార్యనిర్వాహక అధికారి రామకష్ణ పాల్గొన్నారు.