నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒక రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం రాష్ట్రానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్ను సందర్శించారు. అందులో తయారయ్యే వ్యాక్సిన్లు, ఇతర ఔషదాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకష్ణన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్వాగతం పలికారు. సాయంత్రం రాజ్భవన్లో కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం టీటీడీ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు తిరుమలకు బయలుదేరి వెళ్లారు.