జోరుగా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ-సారంగాపూర్‌
మండలంలోని కౌట్ల(బి), స్వర్ణ, లింగాపూర్‌ గ్రామాలలో బుధవారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సరళి వైవిధ్య భరితంగా కొనసాగింది. బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి తమ బృందంతో కలిసి మండుటెండలను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేపట్టారు. ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా పలకరించి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. 13న జరగబోయే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణక్కను అందరి ఆడబిడ్డగా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎండలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రచారంలో కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బాణవత్‌ గోవింద నాయక్‌, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ పోతారెడ్డి, ఉప అధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు, వ్యాపారవేత్త సత్యనారాయణ, మండల కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షులు భీంరావు, నాయకుడు పోతారెడ్డి, సిపిఐ నాయకుడు ఎస్‌ఎన్‌ రెడ్డి, పౌర హక్కుల సంఘం నాయకులు బోరన్న, శశికళ పాల్గొన్నారు.

Spread the love