![](https://navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231128-WA0001.jpg)
నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఒకసారి ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్న గారి మధుసూదన్ రావు నిజాంబాద్ జిల్లా ప్రజలకు కోరారు. ఈ మేరకు మంగళవారం నిజాంబాద్ నగరంలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని లీగల్సేల్ కన్వీనర్ మధుసూదన్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారా జరిగిందని ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కవితా రెడ్డి ఎం వరలక్ష్మి నాగరాజు, సాయి ప్రసాద్, మానస, రజిత, తదితరులు పాల్గొన్నారు.