మా పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తాం

నవతెలంగాణ – గోవిందరావుపేట

ఈ విద్యా సంవత్సరంలో మా పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తామని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమంలో దసరా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలోని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి బడిబాట కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తున్నందున పూర్వ విద్యార్థులు కూడా పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక సౌకర్యాలు పరికరాలు ఏర్పాటు చేసినందున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అంతేగాక మా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన బాగుందని అక్కడే చదువుకుంటామని చెబుతున్నారని అన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రారెడ్డి అన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామరాజు కనకయ్య మరియు పూర్వ విద్యార్థుల తరఫున ఏనుగు రవీందర్ రెడ్డి వడకం ఉపేందర్  విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Spread the love