విశ్వరూప మహాసభకు తరలిరావాలి:

– ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ
నవ తెలంగాణ – కాటారం
హైదరాబాద్ లో వచ్చే నెల ఆగస్టు లో జరగబోయే విశ్వరూప మహాసభకు మాదిగలంతా ఏకమై తరలిరావాలని కాటారం ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ కోరారు. సోమవారం కాటారం మండలం లోని అంకుశపూర్,కొత్తపల్లి గ్రామాల్లో విశ్వరూప సభ సక్సెస్ కోసం ప్రచారం నిర్వహించారు. ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల ఆత్మగౌరవ సభకై ప్రతి ఇంటి నుండి కదం తొక్కాలని ప్రచారం చేశారు.ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాటం ఆపేదిలేదని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలను ఏకం చేసి భారీ సంఖ్య లో సభకు తరలివెల్లాలని సూచించారు.ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సభకు వెళ్లడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు. కార్యక్రమం లో ఎంఎస్పీ మండల కన్వీనర్ వస్తాద్, ఎంఎస్పీ కాటారం ఇంచార్జి చంద్రగిరి అశోక్, ఎమ్మార్పిఎస్ మండలం ఉపాధ్యక్షుడు మంతెన సతీష్,అంకుశపూర్, కొత్తపల్లి గ్రామ శాఖల అధ్యక్షులు బొల్లి సతీష్, బొల్లి స్వామి, ఇనుగాల లింగయ్య, చంద్రయ్య, మల్లేష్,తదితరులు పాల్గొన్నారు

Spread the love