చిదినెపల్లి ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీపీ

నవ తెలంగాణ- కాటారం
చిదినేపల్లి ప్రాథమిక పాఠశాలను కాటారం పంతకాని సమ్మయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, విద్యా బోధన, విద్యా ప్రమాణాలను గూర్చి ప్రధానోపాధ్యాయులు సురేష్ తో చర్చించారు. శిథిలావస్థకు లో నిరుపయోగంగా ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించి మరమ్మత్తులకై రెండు లక్షల ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. ఐదు తరగతులు ఒకే గదిలో నిర్వహిస్తుండడం ఇబ్బందిగా ఉందని హెచ్ఎం సురేష్ వినతి చేయగా వెంటనే స్పందించి మరమ్మతులకు నిధులు మండల పరిషత్తు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీపీ సమ్మయ్య వెంట ఎంపిటిసి మహేష్ రవీందర్రావు, కుమ్మరి అశోక్, గడ్డం కొమరయ్య లు ఉన్నారు.

Spread the love