అభ్యర్థన అందితే పరిశీలిస్తాం

–  దేశం పేరు మార్పుపై ఐరాస
ఐక్యరాజ్యసమితి : ఏదైనా దేశం తన పేరును మార్చాలని కోరుతూ అభ్యర్థన పంపితే అప్పుడే దానిని పరిశీలిస్తామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్‌ సహాయ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన గత సంవత్సరం టర్కీ పేరును తుర్కియేగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ‘తుర్కియే విషయానికి వస్తే అక్కడి ప్రభుత్వం పంపిన అభ్యర్థనపై మేము స్పందించాము. అలాంటి అభ్యర్థనలు ఏవైనా వస్తే అవి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన చెప్పారు.

Spread the love