ఆర్యవైశ్యులకు అన్ని విధాల అండగా ఉంటాం

మాజీ కార్పొరేటర్‌ సురేష్‌ రెడ్డి
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ కార్పొరేటర్‌ సురేష్‌ రెడ్డి అన్నారు. సుభాష్‌ నగర్‌ 130 డివిజన్‌ పరిధిలో గల వెంకటాద్రి నగర్‌లో శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు సోమవారం నిర్వహించిన హౌమ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్యవైశ్యులను గుర్తించి రాజకీయ పదవులను ఇచ్చి గౌరవాన్ని కల్పించారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అభివద్ధి చెందుతున్నారన్నారు. ఆర్యవైశ్యులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు.

Spread the love