నవతెలంగాణ- హైదరాబాద్: భారత్తో మొదటి టీ20 మ్యాచ్లో అతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు. కాగా ముఖేష్ కుమార్ ఈ విండీస్ పర్యటనలోనే టెస్టులు, వన్డేల్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.