పాక్ ప్రధాని చర్చల మాటపై స్పందించిన భారత్

నవతెలంగాణ -హైదరాబాద్: దౌత్య సంబంధాలపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ సహా పొరుగున ఉన్న అన్ని దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు తెలిపింది. భారత్‌తో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఢిల్లీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. పొరుగు దేశాలతో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని, కానీ ఉగ్రవాదరహిత వాతావరణం ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.

Spread the love