నలుగురు బియ్యం దొంగల అరెస్ట్

నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలో రెంజల్ రోడ్డు లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు బియ్యం దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్ద రైస్ మిల్లులో కోన విశ్వనాథ్ కు చెందిన 10 రైస్ బ్యాగులను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా గురువారం అనుమానస్పదంగా ఆటోలో వెళుతున్న నలుగురిని అరెస్టు చేసి విచారించగా దొంగిలించినట్లు ఒప్పుకోవడంతో సయ్యద్ అమీర్, షేక్ గౌస్, షేక్ అమీర్ ఖాన్, షేక్ అస్లాం లను అరెస్టు చేసి రైస్ బ్యాగులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Spread the love