నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్లు హెడ్ (89), అభిషేక్ శర్మ (46) విధ్వంసం సృష్టించారు. అహ్మద్ ( 59*) మెరుపులు మెరిపించాడు. నితీశ్ రెడ్డి(37) ఫర్వాలేదనిపించాడు. మార్క్రమ్ (1), క్లాసెన్ (15), సమద్ (13), కమిన్స్ (1) నిరాశ పరిచారు. బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.