ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు లూటీ..!

– 10 తులాల బంగారం, వెండి, నగదు అపహరణ
నవతెలంగాణ-జవహర్‌నగర్‌
ఊరేళ్లి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంగిలిపల్లి రవీందర్‌ అనే వ్యక్తి సాయి సిద్ధార్థనగర్‌, దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. రవీందర్‌ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సిద్దిపేటలో ఓ కార్యక్రమానికి హాజరై మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగుగొట్టి బీరువాలో ఉన్న బంగారు లాకెట్‌, గొలుసు, నెక్లెస్‌, కంకణాలు, వజ్రాలహారం, మొత్తం 10 తులాల బంగారం, వెండి వస్తువులు, నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love