– మూడు వినూత్న చెల్లింపులు
ముంబయి : కొత్తగా యుపిఐలో మూడు వినూత్న డిజిటల్ చెల్లింపుల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెల్లడించింది. ఇందులో యుపిఐ 123పే ఐవిఆర్ ద్వారా చెల్లింపు, వ్యాపారి లావాదేవీల కోసం యుపిఐ ప్లగ్-ఇన్ సేవ, క్యుఆర్లో స్వీయ చెల్లింపులు ఉన్నాయని హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ పరాగ్ రావ్ పేర్కొన్నారు.