ఆ బస్సుల్లో మహిళలకు ఫ్రీ

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’ పథకం విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.

Spread the love