పదలాలిత్యం, భావసౌందర్యం లలిత సంగీతానికి ఆభరణాలు…

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
పదలాలిత్యం, భావ సౌందర్యం లలిత సంగీతానికి ఆభరణాలని రాష్ట్రఖజానా,గణాంకఉపసంచాలకులు జి.వసుంధర అన్నారు. నవ్య నాటక సమితి ఆధ్వర్యంలో  సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో ఏవీ సావిత్రి స్మారక లలిత సంగీత పోటీలను ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాన్య ప్రజల హృదయ గీతం లలిత సంగీతమన్నారు. ప్రముఖ గాయని డి. సురేఖమూర్తి మాట్లాడారు. ఆచార్య ఫణీంద్ర, డాక్టర్. నండూరి విద్యారణ్యస్వామి, ఏవీ సావిత్రి సోదరులు ఏవీ.రామారావు, నిష్టల సుధా మాల, నవ్య నాటక సమితి అధ్యక్షుడు వేమరాజు విజయకుమార్ తదితరు పాల్గొన్నారు
Spread the love