డ్రైనేజీ సమస్యల పరిష్కారాన్నికృషి

-కార్పొరేటర్‌ పద్మ వెంకట్‌ రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
డ్రైనేజీ సమస్యల పరిష్కా రానికి నిరంతరం డయినేజీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నానని బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్‌ బి.పద్మ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమ వారం బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌ పరిధిలోని పోచమ్మ బస్తి బతు కమ్మ కుంట ప్రాంతంలో డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్న సమస్య తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్‌ వెంటనే వాటర్‌ వర్క్స్‌ డీజీఎం విష్ణువర్ధన్‌ రావు దష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి మూసుకుపోయిన డ్రైనేజీ మాన్యువల్స్‌ సంగతి తెలుసుకొని వాటిని డ్రైనేజీ సూపర్వై జర్‌ లక్ష్మణ్‌తో కలిసి తీయించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు వెంకట్‌ రెడ్డి ,నాయ కులు మిరియాల శ్రీనివాస్‌,డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రమేష్‌ ముదిరాజ్‌ ,వెంకటేష్‌ ముదిరాజ్‌ , బాలకష్ణ గౌడ్‌ , సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love