జెడ్పీటీసీ తుమ్మల హరిబాబుకు మతృవియోగం

నవతెలంగాణ – గోవిందరావుపేట
జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు తల్లి తుమ్మల టాన్యరాణి (బుజ్జమ్మ) శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని వారి నివాస గృహంలో తుది శ్వాస విడిచి స్వర్గస్తులైనారు. వృద్ధురాలు అయినా హరిబాబు తల్లి వేసవి తీవ్రతకు తట్టుకోలేక మృతి చెందారు. శనివారం ఉదయం ఏడు గంటలకు మండల కేంద్రంలో అంత్య క్రియలు నిర్వహిస్తారని హరిబాబు కుటుంబీకులు తెలిపారు. హరిబాబు తల్లి మరణ వార్త విని పలు రాజకీయ పార్టీల నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హరిబాబు కుటుంబానికి వెళ్లి వారి తల్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి సంతాపాన్ని తెలిపారు. దుఃఖ సాగరంలో ఉన్న హరిబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. హరిబాబుది మొదటి నుండి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా హరిబాబు రాజకీయంగా సుపరిచితులు అయినందున నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం వరకు వారి స్వగృహంలో పార్థివ దేహాన్ని అందుబాటులో  ఉంచుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అంత్యక్రియలను నిర్వహిస్తామని అన్నారు.
Spread the love