అరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలి

– అరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ డిమాండ్‌
హైదరాబాద్‌ : అరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని అరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ కోరారు. ఈ డిమాండ్‌ సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. దీనికి అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. కాచిగూడ తూల్జా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ దిగంబర రావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి పటేల్‌, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మార్జోడు రాంబాబు, రైతు సంఘం అధ్యక్షుడు మొర్తా ల చందర్‌ రావు, తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. సంఘం, కులస్థులను తప్పుదోవ పట్టించేందుకు సంఘం స్టీరింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లింగంపల్లి కిషన్‌ రావు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నేత కోలా కృష్ణస్వామి, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు దోనే కిషన్‌ రావు పాల్గొన్నారు.

Spread the love