నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ల్యాబ్ టెక్నీషియన్లు ఈనెల 17 నుంచి సమ్మె చేయబోతున్నారు. ఈ మేరకు సోమవారం ఎన్హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ ఆరోగ్య పథకం పరిధిలో 620 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 550 మంది ఫార్మాసిస్టులు, 2,600 మంది స్టాఫ్ నర్సులు, 4,500 మంది సెకెండ్ ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్హెచ్ఎం డాక్టర్లకు వెయిటేజీ ఇచ్చి రెగ్యులర్ చేసినట్టుగానేతమను కూడా చేయాలని పలుమార్లు అధికారులు, మంత్రులను కోరినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమ్మె చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇక రోగులకు వివిధ రకాల రక్తపరీక్షలు, టీబీ, మలేరియాతో పాటు కోవిడ్ టెస్టులను కూడా నిర్వహించబోమని స్పష్టం చేశారు.