టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నాయి. ముంబై బౌలర్‌ కొయెట్జీ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో అతని స్థానంలో లూక్‌ వుడ్‌ బరిలోకి దిగనుండగా.. ఢిల్లీ తరఫున ఫామ్‌లో లేని పృథ్వీ షా తరఫున కుమార్‌ కుషాగ్రా బరిలోకి దిగనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, రసిఖ్‌ సలాం (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార, సూర్యకుమార్‌ యాదవ్‌ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)

Spread the love