త్రిపురలో మోడీ ప్రచారం

అంబాసా : పార్లమెంటులో ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు కానీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కానీ ఏ మాత్రం సమాధానం చెప్పకుండా ఎదురుదాడి సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. త్రిపురలో ఎన్నికల ప్రచార సభలోనే అదే తీరుతో ప్రసంగించారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేళ్లు ఏమిటో చెప్పకుండా గత ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగింది. త్రిపుర ఎన్నికల సందర్భంగా ధలారు జిల్లాలోని అంబాసాలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. త్రిపురలో ఏళ్ళ తరబడి వారి పాలన వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. గిరిజనుల్లో గత ప్రభుత్వాలు చీలికలను సృష్టించాయని, కానీ బిజెపి మాత్రం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడకుండా వుండాలంటే బిజెపికే ఓటు వేయాలని కోరారు.

Spread the love