ముగిసిన కెసిఆర్‌ సేవాదళం క్రికెట్‌ టోర్నీ

హైదరాబాద్‌ : కెసిఆర్‌ సేవాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్‌ ఇండియా క్రికెట్‌ పోటీలు గురువారం ఎల్బీ స్టేడియంలో ముగిశాయి. ఫైనల్లో రాయల్‌ హిట్టర్స్‌ క్లబ్‌పై ఎంఐసీసీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాయల్‌ హిట్టర్స్‌ క్లబ్‌ తొలుత 53/4 పరుగులు చేయగా.. ఛేదనలో 4.5 ఓవర్లలోనే ఎంఐసీసీ 56/4తో విజయం సాధించింది. విజేతలకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ బహుమతులు ప్రదానం చేశారు. విజేతకు రూ.లక్ష, రన్నరప్‌కు రూ.50 వేలు నగదు బహుమతి అందించారు. కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్‌ మహ్మద్‌ అమీర్‌, శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ సహా తదితరులు పాల్గొన్నారు. ముగింపు వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Spread the love