రెండు రాష్ట్రాల్లో బీజేపీ.. మేఘాలయలో ఎన్‌పీపీ దూకుడు

నవతెలంగాణ – హైదరాబాద్
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షాలకు స్పష్టమైన ఆధిక్యం ఉండగా మేఘాలయలో సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫలితాలను గమనించుకుంటే ఇలా ఉన్నాయి.
త్రిపురలో బీజేపీ కూటమి మూడు చోట్ల విజయం సాధించి మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 మార్క్‌ను అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ -వామపక్షాల కూటమి 14 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) ఒక చోట విజయం సాధించి మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాగాలాండ్‌ లో బీజేపీ – ఎన్‌డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు ఈ కూటమి ఐదు చోట్ల విజయం సాధించగా మరో 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 2, కాంగ్రెస్‌ 3, ఎన్‌పీపీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొంది 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మేఘాలయలో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. అయితే, ఇక్కడ సీఎం కాన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ దూకుడుగా ఉంది. ఇప్పటివరకు ఈ పార్టీ 4 చోట్ల గెలుపొంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 7, బీజేపీ 4, కాంగ్రెస్‌ 4, ఇతరులు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Spread the love