₹5 లక్షల ప్రోసెడింగ్ పత్రం  అందజేత..

నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని కమలాపుర్ గ్రామంలో మున్నురు కాపు సంఘ భావన నిర్మాణానికి ఎస్ డి ఎఫ్ నీదుల నుండి మంజూరైన 5లక్షల రూపాయల ప్రోసెడింగ్ పత్రాన్ని సర్పంచ్ నడ్పన్న కు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన నివాస గృహాం లో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని,అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 42 కోట్లు ఎస్ డి ఎఫ్, సిడిపి నిధులతో చాలావరకు కమ్యూనిటీ భవన లను నిర్మించుకోవడం జరిగిందని, ఇంకా జరుగుతున్నాయని, ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 20 కోట్ల రూపాయలతో ఎనర్జీ ఎస్ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన సిసి డ్రైనేజీలు, రాహదరుల నిర్మాణం జరిగాయని అయన వివరించారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్,కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love