నవతెలంగాణ – హైదరాబాద్: ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి పది మందికి గాయాలైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొఘల్పురా అస్లా ఫంక్షన్హాల్ సమీపంలో రోడ్పై వెళ్తోన్న బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైకర్ వెంటనే వాహనాన్ని ఆపేశాడు. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న భవానీ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానాకి ప్రయత్నిస్తున్నారు.