1000 రోజుల విశాఖ స్టీల్‌ పోరాటం

1000 Days Visakha Steel Struggleవిశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం ఆపేస్తున్నామని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు మా పోరాటం కొనసాగుతుందని వెయ్యి రోజులకు ముందే విశాఖపట్నం కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సమక్షంలో ప్రకటించాము. పెద్ద దీక్షా శిబిరం వేస్తున్నారని కొందరు ఆశ్చర్యపోయారు. పోరాట కమిటీలోని కొంతమంది సభ్యులతో సహా ఎంత కాలం కొనసాగించగలం? అని ఆనాడు అనుమానాలు వచ్చాయి. గుర్తింపు సంఘంలో వున్న సీఐటీయు పోరాటాలపై అకుంఠిత విశ్వాసం గల సంస్థ. అందువల్లనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు సీఐటీయు నాయ కత్వం స్పష్టంగా ప్రకటించింది. వెయ్యి రోజులైనా చెక్కుచెదరకుండా ఈ ఉద్యమం సాగడానికి కార ణం ఏమిటి? 32 మంది ప్రాణాల బలిదానంతో విశాఖ స్టీల్‌ ఏర్పడింది. ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతి రేకంగా కమ్యూనిస్టులదే కీలక పాత్ర. 52 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు రాజీ నామా చేశారు. 68 గ్రామాలలో నివసించే ప్రజలు ఇండ్లను, 20 వేల ఎకరాల భూములను త్యాగం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి కార్మికులు ఉత్పత్తి పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేవలం రూ.5 వేల కోట్ల లోపే పెట్టుబడి పెట్టింది. కానీ ఈనాడు స్టీల్‌ప్లాంట్‌ విలువ రూ.3లక్ష కోట్లలకు పైగా పెరిగింది. దీనిని కాపాడు కోవడానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, చుట్టూ ప్రజలు, రాష్ట్ర ప్రజల మద్దతుతో అకుంఠిత దీక్షతో నిలబడ్డారు. పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు, ఆఫీసర్లతో ఐక్యత సాధించి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి ఏర్పడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నవంబరు 8వ తేదీ నాటికి పోరాటం ప్రారంభించి వెయ్యి రోజు లు అయ్యింది. ఆ రోజు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎదురుగా కూర్మన పాలెం జాతీయ రహదారి దిగ్బంధనం జరుగుతుంది.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం 27జనవరి2021న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నూరు శాతం అమ్మివేస్తామని ప్రకటించారు. దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో కంపెనీకి అమ్మి కమీషన్‌ కొట్టేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు పథకం వేసాయి. పోరాట కమిటీ ఆధ్వర్యంలో అమ్మకానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకో గలిగాము. నూరు శాతం అమ్మకం జరగాలంటే మొదట విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన అన్ని ఆస్తులను విలువ లెక్కలు కట్టాలి. ప్లాంట్‌లోని యంత్రాలు, భవనాలు, సామానులు, టౌన్‌షిప్‌, దేశంలోని అన్ని మార్కెట్‌ యార్డ్‌లు, దానిలో స్టీల్‌, మాదారం, జగ్గయ్యపేట గనులతో సహా అన్ని ఆస్తులకు విలువ కట్టాలి. విలువ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెండు కమి టీలు వేసింది. ఈ కమిటీలు ప్రత్యక్షంగా ప్రతి ఆస్తిని పరిశీలించి లెక్కలు వేయాలి. రెండేండ్ల క్రితం ఈ కమిటీ హెలికాప్టర్‌లో బ్లాస్‌ ఫర్నేస్‌ వద్ద దిగబోతున్నారని సమాచారం రావడంతో వేలాది మంది స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు అక్కడికి చేరారు. హెలికాప్టర్‌ వెనక్కి వెళ్ళింది. తిరిగి రాలేదు. విలు వ కట్టిన తరువాత రెండవ దశ ఉంటుంది. విలువ ఆధారంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కొనడానికి ఆసక్తి వున్నవారు ముందుకు రావాలని రెండు నెలల ముందు పత్రికా ప్రకటన చేయాలి. విలువ కట్టలేదు కాబట్టి ఈ ప్రకటన రాలేదు. మూడవ దశ బిడ్డింగ్‌ (అమ్మకం). అమ్మకం షరతులు ఉంటాయి. మొదటి, రెండు దశలు కాలేదు కాబట్టి మూడవ దశ ప్రసక్తే రాలేదు.
విశాఖ స్టీల్‌ ఆమ్మకం సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వానికి తత్వం బోధపడింది. అందువల్ల సంవత్సరం నుంచి విశాఖ స్టీల్‌ ను దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం దొడ్డిదార్లు వెతుకు తున్నారు. 2021-22లో విశాఖ స్టీల్‌కు నికర లాభాలు రూ. 940 కోట్లు వచ్చాయి. తరువాత సంవత్సరం ముడిసరుకు కొన డానికి ఆ డబ్బులు వుంచకుండా బ్యాంకులకు అప్పులు చెల్లిం చారు. ముడి సరుకులు కొనడానికి డబ్బులు లేవనే వంకతో విశాఖ స్టీల్‌ ఉత్పత్తి 40 శాతం తగ్గించారు. దేశంలోని అన్ని స్టీల్‌ ప్లాంట్లకు లాభాలు వచ్చాయి. విశాఖ స్టీల్‌కు రూ.3900 కోట్లు నష్టాలు వచ్చాయి. దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌లకు స్వంత గనులు న్నాయి. విశాఖ స్టీల్‌కు 40 సంవత్సరాల నుంచి ఎన్ని పోరా టాలు చేసినా స్వంత గనులు ఇవ్వడానికి కాంగ్రెస్‌, బీజేపీ ప్రభు త్వాలు నిరాకరించాయి. ఈ ప్లాంట్‌ ప్రధాన సమస్య ఇదే. ఈ సమస్యను పరిష్కరించకుండా ప్లాంట్‌ను నిలువునా నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తు న్నది. ఈ విషయాలను పక్కదారి పట్టించ డానికి బీజేపీ ఎంపీ జివిఎల్‌ నరసింహారావు ”విశాఖ స్టీల్‌”ను ప్రయివేటు చేయడం లేదని, పూర్వ వైభవం తెస్తామని ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు మూసివేసిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను జిందాల్‌ కంపెనీకి అప్పగిం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖ రాశారు. బిఎఫ్‌-3ను జిందాల్‌కు అప్పగిం చడం అంటే దొడ్డి దారిన విశాఖ స్టీల్‌ను ప్రయివేటుకు అప్పగించడమే. పోరాట కమిటి దీనిని తీవ్రంగా వ్యతిరేకిం చడంలో కేంద్ర ప్రభుత్వం వెనుక్కు తగ్గింది. ఇవి బీజేపీ మోసపూరిత ప్రకటనలు. బీజేపీ మోసాలను ప్రజలకు వివరించడం మన కర్తవ్యం. ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొట్టి, కులచిచ్చులు పెట్టి పాలించాలని బీజేపీ భావిస్తున్నది.
ఈ వెయ్యిరోజుల పోరాటంలో రాష్ట్ర ప్రజలు, వివిధ సం ఘాలు, సంస్ధలు విశాఖస్టీల్‌కు అపూర్వ మద్దతు పలికాయి. కానీ ప్రధాన రాజకీయపార్టీలు నాటకాలాడాయి. బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలనే నిర్ణయం దుర్మార్గం. రాష్ట్రం లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రధాన ప్రతి పక్ష పార్టీలు టీడీపీ, జనసేన పార్టీలు విశాఖ స్టీల్‌ ఉద్యమా నికి పైకి మద్దతు ఇస్తునే డ్రామాలు ఆడారు. పార్ల మెంట్‌లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రయివేటు చేస్తారా అని ప్రశ్నించడం, బీజేపీ మంత్రు లు విశాఖ స్టీల్‌ను ప్రయివేటు చేసి తీరుతామని ప్రకటిం చడం దొంగ నాటకం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వంత గనులు ఎందుకివ్వరు? అని ఒక్కరోజు అయినా పార్లమెంట్‌లో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌, టీడీపీలు బీజేపీ ప్రశ్నించారా? బీజేపీ అన్ని బిల్లు లకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టీడీపీలు మద్దతు ఇచ్చాయి. మా పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మద్దతుతో, కార్మికుల పట్టుదలతో ఈ ఉద్యమం ఎంతకాలమైన సాగుతుందని విశ్వాసం కలిగింది. కమ్యూనిస్టులు ఒక్కరే 1966 ”విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” ఉద్యమం నుండి నేటి వరకు నికరంగా, నిజా యితీగా విశాఖస్టీల్‌ పక్షాన నిలబడ్డారు. బీజేపీ ప్రయివేటీకరణ విధానాలను ఓడించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు రైల్వే, విద్యుత్‌, ఆయిల్‌ రంగం, బ్యాంక్‌, ఇన్సూరెన్స్‌ రంగాలతో సహా అన్ని రంగాలను కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు మేనేజర్లు మాత్రమే. ప్రభుత్వ రంగం అంటే ప్రజల ఆస్థి. ప్రజల ఆస్తులను అమ్మేందుకు వీరికి ఎవరు హక్కు ఇచ్చారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలంటే వీరి తాతగారి ముల్లె కాదు.
విశాఖ స్టీల్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మిలియన్‌ టన్ను ల సామర్ధ్యం కలిగిన ”నగర్‌నార్‌” స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుకు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బిడ్డింగ్‌ కూడా పూర్త యింది. జిందాల్‌ స్టీల్‌ బిడ్డింగ్‌లో నెం.1గా వచ్చింది. ఈ లోగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. నగర్‌నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను దేశానికి అంకితం చేయడానికి వచ్చిన రోజే సెప్టెం బరు 2023లో ఛత్తీస్‌గఢ్‌ లోని బీజేపీయేతర రాజకీయ పార్టీ లన్నీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం తోక ముడిచి నగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటు చేయటం లేదని అమిత్‌షా రాయిపూర్‌ వచ్చి ప్రకటించారు. పోరాడితేనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోగలమని నగర్‌నార్‌, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లు రుజువు చేశాయి. గతంలో సేలం, దుర్గాపూర్‌ (ఎల్లాయి) స్టీల్‌ ప్లాంట్‌లు కూడా పోరాడే అమ్మకాలను ఆప గలిగాయి. పోరాటంతోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకో గలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోగలం. ఈ పోరాటాలను యావత్తు కార్మికవర్గం మరింత ఉధృతం చేయా లని కోరుతున్నాం.
సెల్‌ : 9490098789
సిహెచ్‌ నర్సింగరావు

Spread the love