బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు

నవతెలంగాణ – ప్రకాశం:  దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. దాదాపు 25 మంది భక్తులు బుధవారం రాత్రి 2 బొలెరో వాహనాల్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయల్దేరి వెళ్లారు. శ్రీశైలానికి 15 కిమీ దూరంలో అందులోని ఒక వాహనం బోల్తా పడింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Spread the love