కాంగ్రెస్‌ టికెట్‌ కోసం మొదటి రోజు 18 దరఖాస్తులు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్లు ఆశించే వారి నుంచి మొదటి రోజు 18 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం మద్యాహ్నం ఒంటిగంటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. సాయంత్రం 6 గంటల వరకు 18 మంది తమ దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు నమూనా ఆలస్యంగా విడుదల కావడంతో దరఖాస్తులు తక్కువగా వచ్చినట్టు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.
సత్తుపల్లి నుంచి మానవతారారు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారారు మొట్టమొదటి దరఖాస్తు దాఖలు చేశారు. అదేవిధంగా వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ఎంపీపీ మేఘారెడ్డి రెండో దరఖాస్తు వేశారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక వాటిని పరిశీలించి అర్హులైన వారితో కూడిన జాబితాను కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేయనుంది.

Spread the love