చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి

నవతెలంగాణ – బీజింగ్‌: దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ, డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో కొంత భాగం బుధవారం తెల్లవారు జామున 2:10 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాల్లోని 49 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు దాదాపు 500 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. క్షయగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో 19 మంది మృతి చెందారు. మరో ముప్ఫై మంది తీవ్రంగా గాయపడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Spread the love