– జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: హోమ్ ఓటింగ్ లో భాగంగా బుధవారం నాటికి జిల్లాలో 85 ఏండ్లు పైబడిన వారు 770 మంది ఓటు వేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1194 మంది దివ్యాంగులు ఓటు వేసినట్టు ఆమె పేర్కొన్నారు. అత్యవసర సేవలకకు సంబంధించిన ఉద్యోగులు 44 మంది ఓటు వేశారని, జిల్లాలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా 11488 మంది ఉద్యోగులు ఓటు వేసినట్టు ఆమె వెల్లడించారు.