- Advertisement -
నవతెలంగాణ- జన్నారం
జన్నారం మండలానికి చెందిన పలువురు వివోఏలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వివోఎల సంఘం చలో సెర్ప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం జన్నారం మండలానికి చెందిన వివోఎల సంఘం నాయకులు బి.రమేశ్, అనంతుల లక్ష్మీనారాయణలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం పోలీసులతో అరెస్టు చేయించడం సరికాదని వారన్నారు.
- Advertisement -