Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేనేత సంక్షేమ పథకాలు సాధించుకోవడం మన హక్కు 

చేనేత సంక్షేమ పథకాలు సాధించుకోవడం మన హక్కు 

- Advertisement -

– కలిసికట్టుగా పోరాడితేనే చేనేత మనకొడకు సాధ్యం 
– ఈనెల 20న నిర్వహించే చేనేత మహాధర్నా లో పాల్గొని జయప్రదం చేయాలి 
తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ : రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

చేనేత కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందుకోవాలంటే చేనేత కార్మికులు కలిసికట్టుగా పోరాడితేనే సాధ్యమవుతుందని, అధి కార్మికుల హక్కు అని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ అన్నారు. విభిన్న మతాలకు, కులాలకు అతీతంగా రాజోలి చేనేత కేంద్రంగా ఉన్నదని రాష్ట్ర గౌరవాధ్యక్షులు  చెరుపల్లి సీతారాములు మాజీ శాసన మండలి సభ్యులు అన్నారు.

బుధవారము మండల కేంద్రమైన రాజోలిలోని చేనేత సహకార సంఘం అధ్యక్షులు  దోత్రి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత రుణమాఫీ మహా ర్యాలీ కార్యక్రమం కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు చేనేత కార్మికులు రాజోలి చేనేత సహకార సంఘం నుంచి ప్రధాన వీధుల గుండా తాసిల్దార్ కార్యాలయం  వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తాసిల్దార్ రామ్మోహన్ కు చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నూలు మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయం ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సభా సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా రుణమాఫీ చేయడం లేదని పారిశ్రామికవేత్తలకు వేలకోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు చేసి ఎగరేస్తే వారికి రుణ మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు కష్టపడి పని చేస్తూ అప్పుల పాలైన చేనేత కార్మికుల చేయాల్సిన రుణమాఫీ కేవలం 63 కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. అందుకు ఈ నెల 20న హైదరాబాద్ లోని చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం నందు నిర్వహించే మహా ధర్నాకు రాజోలి చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పోరాడితేనే తమ హక్కులు సాధించుకోగలమని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు మాట్లాడుతూ…. విభిన్న మతాలు కులాలకు అతీతంగా రాజోలి చేనేత కేంద్రంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  పట్టుచీరలకు చాలా ప్రాముఖ్యత ఉందని, ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప చేనేత కార్మికుల బ్రతుకులు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈనెల 20న నిర్వహించే మహా ధర్నాకు అధిక సంఖ్యలో  రాజోలి చేనేత కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం కార్యదర్శి నరహరి , రాజోలి చేనేత సహకార సంఘం అధ్యక్షులు డి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మాబు, రాజోలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దస్తగిరి, సిపిఎం నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -