- Advertisement -
- – నవతెలంగాణ లో ప్రచురితం అయిన వార్తా కధనం…
- – తరలించిన ధాన్యం….
నవతెలంగాణ – అశ్వారావుపేట
అకాల వర్షాలు,ఆందోళనలో రైతులు,సోషల్ మీడియాలో వైరల్ అయిన అచ్యుతాపురం రైతు ఆవేదన నవతెలంగాణ లో గురువారం ప్రచురితం అయిన కథనానికి స్పందన లభించింది. నవతెలంగాణ వార్తా కథనాన్ని బాధిత రైతులు వాట్సాప్ లో విస్త్రుత ప్రచారం చేసారు.ఈ విషయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచర స్థానిక నాయకులు ఒకరు జిల్లా కో ఆపరేటివ్ అధికారితో మాట్లాడారు.దీంతో ఆయన స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేసారు. శనివారం అచ్యుతాపురం లోని ఐదుగురు రైతులకు చెందిన 30 టన్నుల ధాన్యాన్ని తరలించారు.దీంతో రైతులు హర్షం వ్యక్తం చేసారు.
- Advertisement -