కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొండంపేట, కొయ్యుర్, వళ్లెంకుంట, ఇప్పలపల్లి తదితర గ్రామాల్లో 24 గంటలు అందుబాటులో ఉంటూ, ఇటూ పేద ప్రజలకు గ్రామీణ వైద్యుడుగా,అటూ పశువులకు (వి.ఎస్) వెటర్నరీ సైన్స్ ట్రెనర్ కొండంపేట గ్రామానికి చెందిన కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా సేవాలందిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిచి మరిన్ని సేవలందించడానికి ఒక్కఅడుగూ.. ముందుకేశారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైయ్యారు. ఈ నేపథ్యంలో కొండంపేట గ్రామంలో 5వ వార్డు సభ్యులుగా అత్యధిక మెజార్టీతో కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి విజయం సాధించి, రిటర్నింగ్ అధికారులచే ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఇందుకు ఆ దంపతులకు మండల గ్రామీణ వైద్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.
ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెటర్నరీ సైన్స్ ట్రెనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



