కారు జోరు.. ఏనుగు ప్రచారం..

నవతెలంగాణ – వేములవాడ : వేములాడలో విలీన గ్రామమైన సత్రాజ్ పల్లి లో మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి  ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  శాత్రాజు పల్లె, చుట్టుపక్క గ్రామాలలోగడప గడపకు గులాబీ జెండా ప్రచార కార్యక్రమం లో భాగంగా బీఆర్ఎస్ మెనిఫెస్టో గురించి ప్రతి  ఓటరుకు వివరిస్తూ, ఇంటింటి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, కారు గుర్తుపై ఓటు వేసి “చల్మెడ” ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. వేములవాడ అభివృద్ధి జరగాలంటే మరోసారి వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావును గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు   వివరించారు. సంక్షేమ ఫలాలు అందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, గుడిసె మనోజ్ కుమార్, మ్యాకల శ్రీనివాస్, మొగ్గ అనిల్ కుమార్, కొప్పెర సంతోష్ రెడ్డి, అన్నాడి జనార్దన్ రెడ్డి, ఐత వెంకటేశం, గుడిసె నరేష్, సిరిసిల్ల శంకర్, సుద్దాల వీరేందర్, చందనం వెంకటేష్, విక్కుర్తి సాయి గౌడ్, పురుషోత్తం, దాసు, సూర ఎల్లయ్య, మిట్టపెల్లి రాజు, గడ్డం మధు, శివకృష్ణ, మొగిలి రమేష్, ప్రకాష్, చిగుర్ల రాజు, చిగుర్ల మహేష్, గుంటి ప్రశాంత్, జిల్లా మధు తదితరులు పాల్గొన్నారు.
Spread the love