- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన జర్నలిస్టులందరికీ మే 1 నుంచి 10లోపు కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పష్టం చేసింది. 2022-2024 సంవత్సరాలకు గాను గతంలో జారీ చేసిన కార్డుల గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ కమిషనర్ జి.ముకుంద రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 30లోపు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలు పూర్తి చేసి, అర్హులైన జర్నలిస్టులకు మే 10లోపు కార్డులు జారీ చేయాలని సూచించారు.
- Advertisement -



