- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో సూపర్ డెంట్ గా, ఇంఛార్జి ఎంపిడిఓ గా సుదీర్ఘకాలం విదులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ పొందిన సూపర్ డెంట్ దంపతులకు తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. శ్రీరామూర్తి దంపతులు ఆయురారోగ్యాలతో నిండు వందేళ్లు శేషాజీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



