- Advertisement -
విజయవంతం చేయండి
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ ఐపీసీ చర్చిలో ఈ నెల 09న శనివారం జరుగు ఎన్సీసీ అవగాహన సదస్సుకు జిల్లాలో గల క్రైస్తవులు, హాజరు కావాలని, ఎన్సిసి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రేవా జాన్ జహంగీర్ అన్నారు. గురువారం ఆ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. రాబోయే రోజు లలో క్రైస్తవులకు వారి సమస్య ల పట్ల అండగా ఉంటుందని, ఎన్సిసి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సీసీ సెక్రటరీ విజయ్ కుమార్, ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు పీటర్ బాబు, సెక్రటరీ స్టివెన్, యూత్ వింగ్ అధ్యక్షులు జీవన్, ప్రేయర్ వింగ్ అధ్యక్షులు శారా అబ్రాహాము, ఉపాధ్యక్షులు దావీదు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



