- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, 2024 విద్యార్థి ఉద్యమం తర్వాత భారతదేశంలో ఆశ్రయం పొందుతూ, త్వరలో స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించారు. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ పునరుద్ధరణే తన లక్ష్యమని, తన పార్టీ ‘అవామీ లీగ్’ పై నిషేధం కాగితపు ఆదేశాలతో అంతం కాదని ఆమె అన్నారు. గతంలో 19 సార్లు హత్యాప్రయత్నాలను ఎదుర్కొన్నానని, తన పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన ‘రాజకీయ నరమేధం’ గురించి ప్రస్తావించారు. భారత్-బంగ్లాదేశ్ బంధాన్ని కొనియాడుతూ, కొన్ని గ్రూపులు భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
- Advertisement -



